ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఆరోపణలకు దారి తీస్తోంది. కౌన్సిల్ ఎన్నిక కోసం విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లో కూర్చున్న సమయంలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించారు. అక్కడ రణరంగం సృష్టించారు. హాల్లో బల్లులు, కుర్చీలు విరగ్గొట్టారు. ఓ ఎంపీ కూర్చున్న సమయంలోనే ఇలా జరిగినప్పటికీ... పోలీసులు కనీసం రక్షణ చర్యలు కూడా చేపట్టలేదు. చివరికి వైసీపీ నేతలను బయటకు తీసుకెళ్లేందుకు కూడా పోలీసులు కౌన్సిల్ హాల్ లోనికి రాలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కౌన్సిల్ హాల్ లోనికి బయట వ్యక్తులు ఎలా వచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు దారులను మునిసిపాలిటీకి కిలోమీటర్ దూరంలోనే ఆపేసిన పోలీసులు... వైసీపీ నేతలను మాత్రం కౌన్సిల్ హాల్ లోపలికి ఎలా అనుమతించారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.
ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఆరోపణలకు దారి తీస్తోంది. కౌన్సిల్ ఎన్నిక కోసం విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లో కూర్చున్న సమయంలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించారు. అక్కడ రణరంగం సృష్టించారు. హాల్లో బల్లులు, కుర్చీలు విరగ్గొట్టారు. ఓ ఎంపీ కూర్చున్న సమయంలోనే ఇలా జరిగినప్పటికీ... పోలీసులు కనీసం రక్షణ చర్యలు కూడా చేపట్టలేదు. చివరికి వైసీపీ నేతలను బయటకు తీసుకెళ్లేందుకు కూడా పోలీసులు కౌన్సిల్ హాల్ లోనికి రాలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కౌన్సిల్ హాల్ లోనికి బయట వ్యక్తులు ఎలా వచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు దారులను మునిసిపాలిటీకి కిలోమీటర్ దూరంలోనే ఆపేసిన పోలీసులు... వైసీపీ నేతలను మాత్రం కౌన్సిల్ హాల్ లోపలికి ఎలా అనుమతించారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.