తిరుపతిలోని రాయల చెరువు పూర్తిగా నీటితో నిండిపోయింది. చెరువు కట్ట తెగిపోతుందని ఇప్పటికే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాయల చెరువు ప్రాంతాన్ని సీపీఎం జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పరిశీలించారు. చిత్తూరు జిల్లాని రామచంద్రాపురం మండలం కుప్పంబాదురు నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరం కాలినడకన పర్యటించారు. రాయల చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ సమయంలో బురద కారణంగా కాలు జారి కింద పడిపోయారు నారాయణ. ఈ ఘటనలో నారాయణ కాలు బెణికింది. ఇదే సమయంలో రాయల చెరువును పరిశీలించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నారాయణ కాలు బెణికిన విషయం తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి... ఆయన కాలుకు కట్టుకట్టారు. ఫిజియో థెరపిస్ట్ కావడంతో... కాలుకి మర్ధనా చేశారు. ఆ తర్వాత తన కారులోనే నారాయణను తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. తాను వృత్తి రీత్యా వైద్యుడినని... రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు.
తిరుపతిలోని రాయల చెరువు పూర్తిగా నీటితో నిండిపోయింది. చెరువు కట్ట తెగిపోతుందని ఇప్పటికే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాయల చెరువు ప్రాంతాన్ని సీపీఎం జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పరిశీలించారు. చిత్తూరు జిల్లాని రామచంద్రాపురం మండలం కుప్పంబాదురు నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరం కాలినడకన పర్యటించారు. రాయల చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ సమయంలో బురద కారణంగా కాలు జారి కింద పడిపోయారు నారాయణ. ఈ ఘటనలో నారాయణ కాలు బెణికింది. ఇదే సమయంలో రాయల చెరువును పరిశీలించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నారాయణ కాలు బెణికిన విషయం తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి... ఆయన కాలుకు కట్టుకట్టారు. ఫిజియో థెరపిస్ట్ కావడంతో... కాలుకి మర్ధనా చేశారు. ఆ తర్వాత తన కారులోనే నారాయణను తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. తాను వృత్తి రీత్యా వైద్యుడినని... రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు.