ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ సమయంలో కీలక ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా.. ప్రస్తుత ప్రభుత్వానికి రుణ పరిమితి విధించారని... దీనిని వెంటనే తొలగించాలని కూడా జగన్ ప్రస్తావించారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 3 వేల 847.97 కోట్ల రూపాయలను తాజాగా కేంద్రం విడుదల చేసింది. రెండు నెలల వాయిదాల సొమ్మును 28 రాష్ట్రాలకు ఒకేసారి విడుదల చేసింది కేంద్రం. మొత్తం 95 వేల 82 కోట్ల రూపాయలను 28 రాష్ట్రాల ఖాతాల్లో జమ చేసింది. నవంబర్, డిసెంబర్ నెల వాయిదాల సొమ్మును ఒకేసారి విడుదల చేయాలని ఈ నెల 15న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన వర్చువల్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఒక్కో నెలకు కేంద్రం 47 వేల 541 కోట్ల రూపాయలను తన వంతుగా రాష్ట్రాలకు విడుదల చేస్తుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ సమయంలో కీలక ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా.. ప్రస్తుత ప్రభుత్వానికి రుణ పరిమితి విధించారని... దీనిని వెంటనే తొలగించాలని కూడా జగన్ ప్రస్తావించారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 3 వేల 847.97 కోట్ల రూపాయలను తాజాగా కేంద్రం విడుదల చేసింది. రెండు నెలల వాయిదాల సొమ్మును 28 రాష్ట్రాలకు ఒకేసారి విడుదల చేసింది కేంద్రం. మొత్తం 95 వేల 82 కోట్ల రూపాయలను 28 రాష్ట్రాల ఖాతాల్లో జమ చేసింది. నవంబర్, డిసెంబర్ నెల వాయిదాల సొమ్మును ఒకేసారి విడుదల చేయాలని ఈ నెల 15న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన వర్చువల్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఒక్కో నెలకు కేంద్రం 47 వేల 541 కోట్ల రూపాయలను తన వంతుగా రాష్ట్రాలకు విడుదల చేస్తుంది.