వర్షాలు, వరదల మధ్య కూడా రైతుల మహా పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే రైతులు చేపట్టిన పాదయాత్రకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండగా ఉండగా... ఇప్పుడు బీజేపీ నేతలు కూడా యాత్రకు సంఘీభావం తెలిపారు. 24 రోజులుగా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల కాళ్లు బొబ్బలు ఎక్కాయి. కొంతమంది కాళ్లు వాపు వచ్చాయి. దీంతో పాదయాత్ర కాస్త నెమ్మదిగా సాగుతోంది. యాత్రకు సంఘీభావం తెలిపిన నెల్లూరు జిల్లా రైతులు... మహిళల పాదాలకు పాలాభిషేకం చేశారు. ఇక రైతుల పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ అరవింద్ బాబు 3 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత బీద రవిచంద్ర కూడా తన వంతు సాయంగా 3 లక్షల రూపాయలు రైతులకు అందజేశారు. రాజధానిగా అమరావతిని సాధించే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు.
వర్షాలు, వరదల మధ్య కూడా రైతుల మహా పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే రైతులు చేపట్టిన పాదయాత్రకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండగా ఉండగా... ఇప్పుడు బీజేపీ నేతలు కూడా యాత్రకు సంఘీభావం తెలిపారు. 24 రోజులుగా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల కాళ్లు బొబ్బలు ఎక్కాయి. కొంతమంది కాళ్లు వాపు వచ్చాయి. దీంతో పాదయాత్ర కాస్త నెమ్మదిగా సాగుతోంది. యాత్రకు సంఘీభావం తెలిపిన నెల్లూరు జిల్లా రైతులు... మహిళల పాదాలకు పాలాభిషేకం చేశారు. ఇక రైతుల పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ అరవింద్ బాబు 3 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత బీద రవిచంద్ర కూడా తన వంతు సాయంగా 3 లక్షల రూపాయలు రైతులకు అందజేశారు. రాజధానిగా అమరావతిని సాధించే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు.