అయితే సుధాకర్ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ మృతికి కారణమైన పోలీసులను విచారించేందుకు సీబీఐ ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే జగన్ సర్కార్ మాత్రం అనుమతి నిరాకరించింది. ఇప్పుడు ఇదే విషయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నర్సీపట్నం ఏరీయా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ ఆయన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. బట్టలూడదీసి మరీ రోడ్డుపైనే తన్నుకుంటూ లాక్కెళ్లారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆయనకు పిచ్చి అని ముద్ర కూడా వేశారు. కొద్ది రోజుల పాటు విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స అనంతరం డాక్టర్ సుధాకర్ మరణించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. విశాఖ పోలీసుల్ని ప్రశ్నించేందుకు సీబీఐకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఇప్పుడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్తుల్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అని సూటిగా ప్రశ్నించింది. ఇలాంటి కేసుల్లో ఎలా వ్యవహారించాలో మాకు తెలుసని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.
అయితే సుధాకర్ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ మృతికి కారణమైన పోలీసులను విచారించేందుకు సీబీఐ ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే జగన్ సర్కార్ మాత్రం అనుమతి నిరాకరించింది. ఇప్పుడు ఇదే విషయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నర్సీపట్నం ఏరీయా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ ఆయన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. బట్టలూడదీసి మరీ రోడ్డుపైనే తన్నుకుంటూ లాక్కెళ్లారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆయనకు పిచ్చి అని ముద్ర కూడా వేశారు. కొద్ది రోజుల పాటు విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స అనంతరం డాక్టర్ సుధాకర్ మరణించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. విశాఖ పోలీసుల్ని ప్రశ్నించేందుకు సీబీఐకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఇప్పుడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్తుల్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అని సూటిగా ప్రశ్నించింది. ఇలాంటి కేసుల్లో ఎలా వ్యవహారించాలో మాకు తెలుసని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.