పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో... 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వాడేసుకుంది. వచ్చినంత సేపు కూడా పట్టలేదు డ్రా చేయటానికి. ఇప్పుడు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా వచ్చే సమయం దగ్గర పడింది. అయితే ఇప్పటికే ఆర్థిక లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగన్ సర్కార్... ఆ నిధులు కూడా వాడేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే పంచాయతీలో పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు చేసిన సర్పంచులు... పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని ఇప్పటికే రోడ్డెక్కారు. తాజాగా కడప జిల్లాకు చెందిన 15 మంది సర్పంచులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ... వైసీపీకి రాజీనామా చేశారు. అటు సర్పంచులకు పోటీగా వీఆర్వోలను ప్రభుత్వం రంగంలోకి దింపడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కేటాయింపులో వివక్షత చూపడంతో పాటు... కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో... 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వాడేసుకుంది. వచ్చినంత సేపు కూడా పట్టలేదు డ్రా చేయటానికి. ఇప్పుడు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా వచ్చే సమయం దగ్గర పడింది. అయితే ఇప్పటికే ఆర్థిక లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగన్ సర్కార్... ఆ నిధులు కూడా వాడేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే పంచాయతీలో పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు చేసిన సర్పంచులు... పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని ఇప్పటికే రోడ్డెక్కారు. తాజాగా కడప జిల్లాకు చెందిన 15 మంది సర్పంచులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ... వైసీపీకి రాజీనామా చేశారు. అటు సర్పంచులకు పోటీగా వీఆర్వోలను ప్రభుత్వం రంగంలోకి దింపడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కేటాయింపులో వివక్షత చూపడంతో పాటు... కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు.