పంజాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియా పెరిగిపోయిందని ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాపై నివేదికలను చరణ్ జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేశారని కూడా ఆరోపిస్తున్నారు. నివేదిక బయట పెట్టకపోతే... తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేశారు సిద్ధూ. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని.... రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మారుస్తా అంటూ రెండు నెలల క్రితం చన్నీ చేసిన స్టేట్ మెంట్ను సిద్ధూ గుర్తు చేశారు. ఒక నివేదిక బయట పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సిద్ధూ నిలదీశారు. మెగాలోని బాఘ పురానాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మహాసభలో సిద్ధూ పాల్గొన్నారు. ప్రస్తుతం సిద్ధూ చేసిన కామెంట్లు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే సిద్ధూ ఎదురు తిరగడం రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు.
పంజాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియా పెరిగిపోయిందని ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాపై నివేదికలను చరణ్ జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేశారని కూడా ఆరోపిస్తున్నారు. నివేదిక బయట పెట్టకపోతే... తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేశారు సిద్ధూ. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని.... రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మారుస్తా అంటూ రెండు నెలల క్రితం చన్నీ చేసిన స్టేట్ మెంట్ను సిద్ధూ గుర్తు చేశారు. ఒక నివేదిక బయట పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సిద్ధూ నిలదీశారు. మెగాలోని బాఘ పురానాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మహాసభలో సిద్ధూ పాల్గొన్నారు. ప్రస్తుతం సిద్ధూ చేసిన కామెంట్లు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే సిద్ధూ ఎదురు తిరగడం రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు.