ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే.. “ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ దొంగ నాటకాలు ఆడుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గాంధీ భవన్ లో కొల్లాపూర్ నియోజక వర్గ నాయకులు, టిఆర్ఎస్ ఎన్నారై సెల్ అమెరికా విభాగం అధ్యక్షులు అభిలాశ్ రావ్ తన వందలాది మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. పాలమూర్ జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా అని అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం కొల్లాపూర్ అన్నారు. కొల్లాపూర్ ప్రజలకు తాగడానికి నీళ్ల ఇవ్వరు ..రైతులకు సాగు నీళ్లు ఇవ్వరని..నిర్వాసితులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాను అని నమ్మించి మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది ..ఎవరు పాలన చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలని, పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా మోసం చేసిన ద్రోహి కెసిఆర్, పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు నీకు ఉందా కెసిఆర్ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
"వరి రైతులకి ఉరి అని కేసీఆర్ అంటున్నాడు. రైతులను చంపడానికే టిఆరెస్ , బీజేపీ కలసి పని చేస్తున్నాయి. కెసిఆర్ రెండోసారి సీఎం అయినప్పటి నుండి ఇప్పటి వరకు 67 వేల మంది రైతులు చనిపోయారు.. ఇదా కేసీఆర్ తెలంగాణ రైతులకు చేస్తున్న సంక్షేమం అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.