తిరుపతిలో ఈ నెల 14వ తేదీన సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన ఎన్నో కీలక అంశాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముందు ప్రస్తావించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం అయితే కేంద్రం దగ్గర నానుతూనే ఉంది. రుణాల మంజూరు, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాలపై కేంద్రం పరిశీలిస్తూనే ఉంది. వీటన్నిటికి తోడు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపు వివాదం, ప్రాజెక్టుల అంశాలు కూడా పరిష్కారం కాలేదు. వీటన్నిటిని రాబోయే పార్లమెంట్ శీతాకాలా సమావేశాల్లో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు జగన్ సూచించనున్నారు. పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వేటు వ్యవహారాన్ని ఈ సమావేశాల్లోనే తేల్చుకునేందుకు కూడా పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.
తిరుపతిలో ఈ నెల 14వ తేదీన సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన ఎన్నో కీలక అంశాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముందు ప్రస్తావించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం అయితే కేంద్రం దగ్గర నానుతూనే ఉంది. రుణాల మంజూరు, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాలపై కేంద్రం పరిశీలిస్తూనే ఉంది. వీటన్నిటికి తోడు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపు వివాదం, ప్రాజెక్టుల అంశాలు కూడా పరిష్కారం కాలేదు. వీటన్నిటిని రాబోయే పార్లమెంట్ శీతాకాలా సమావేశాల్లో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు జగన్ సూచించనున్నారు. పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వేటు వ్యవహారాన్ని ఈ సమావేశాల్లోనే తేల్చుకునేందుకు కూడా పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.