తెలంగాణలో రాజకీయంగా సునామీ రాబోతుందా.. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతోందా.. సీఎం కేసీఆర్ అధికారం నుంచి తప్పుకోబోతున్నారా.. తెలంగాణలో టీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందా.. అవునంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తన రాజకీయ పతనం ప్రారంభమైందని కేసీఆర్ కు జ్యోతిషుడు చెప్పారని బండి సంజయ్ అంటున్నారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని తనకు కూడా ఓ జ్యోతిష్కుడు చెప్పారని బండి సంజయ్ అంటున్నారు. తెలంగాణ తల్లి విముక్తి బీజేపీ వల్లే సాధ్యమని ఓ జ్యోతిష్కుడు తనకు చెప్పినట్టు బండి సంజయ్ వెల్లడించారు.


బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే.. “ తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా చేస్తున్న పోరాటంతో అనేక మార్పులు సంభవించాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడో అర్ధం కాలేదు.. ప్రజలను దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాడు.. సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్లి బీజేపీను అప్రతిష్ట పాలు చేసే కుట్రలు పన్నాడు.. రక్తాన్ని దారపోసేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.. ప్రగతి భవన్ లో నాలుగు స్తంభాల ఆట ప్రారంభమైంది.. ముఖ్యమంత్రిని చేయాలని కొడుకు, బిడ్డ, అల్లుడు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.


“ ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి కేసీఆర్ బయటకు పంపిస్తున్నారు.. ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. తెలంగాణ రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నారో కేసీఆర్ చెప్పాలి.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య సిబ్బందిని తొలగించారు.. ఎస్సి ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి విస్మరించి.. ఎస్సి సబ్ ప్లాన్ నిధులను కేసీఆర్ దారి మళ్లించారు.. మతపరమైన రాజకీయాలను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారు.. 80శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే టీఆర్ఎస్, మజ్లీస్ కుట్రలు భగ్నం చేయవచ్చు.. తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయ్యింది.. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టారు.. ప్రజల ఆశీర్వాదంతో 2023లో భాజపా అధికారంలోకి వస్తుంది" అని అంటున్నారు బండి సంజయ్.


మరింత సమాచారం తెలుసుకోండి: