హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం... ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందనే అపవాదు మూట గట్టుకుంది. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఉద్యోగులు కొంత కాలం ఆగలేరా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఉన్న శ్రద్ధ తమపై లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్యోగులు వర్సెస్ పేదలు అన్నట్లుగా మారిపోయింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొత్త ఆలోచనకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు చేసే డిమాండ్లను ప్రస్తుతం ప్రభుత్వం నెరవేర్చలేని పరిస్థితి. దీంతో ... ఉద్యోగులను పేదలతో టార్గెట్ చేయిస్తే ఎలా ఉంటుందని జగన్ సర్కార్ భావిస్తోంది. వేల రూపాయల జీతాలు తీసుకుంటూ కూడా... పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఎలా తప్పుబడతారంటూ ఉద్యోగులపైకి ప్రజలను రెచ్చగెట్టేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి... జగన్ సర్కార్ ఆడబోయే ఈ గేమ్లో గెలుపు ఎవరిదో...!
హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం... ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందనే అపవాదు మూట గట్టుకుంది. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఉద్యోగులు కొంత కాలం ఆగలేరా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఉన్న శ్రద్ధ తమపై లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్యోగులు వర్సెస్ పేదలు అన్నట్లుగా మారిపోయింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొత్త ఆలోచనకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు చేసే డిమాండ్లను ప్రస్తుతం ప్రభుత్వం నెరవేర్చలేని పరిస్థితి. దీంతో ... ఉద్యోగులను పేదలతో టార్గెట్ చేయిస్తే ఎలా ఉంటుందని జగన్ సర్కార్ భావిస్తోంది. వేల రూపాయల జీతాలు తీసుకుంటూ కూడా... పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఎలా తప్పుబడతారంటూ ఉద్యోగులపైకి ప్రజలను రెచ్చగెట్టేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి... జగన్ సర్కార్ ఆడబోయే ఈ గేమ్లో గెలుపు ఎవరిదో...!