నీ అత్త‌ను ఉద్దేశించి అనరాని మాట‌లు అంటే స్పందించ‌కుండా ఉంటావా అని ఫైర్ అవుతున్నారు టీడీపీ వ‌ర్గాలు. అస‌లు మేం మద్ద‌తిస్తేనే క‌దా! నీవు ఇంత‌టి వాడివ‌య్యావు అని కూడా అంటున్నారు. అంతేకాదు రాజ‌కీయాల్లో సుప్ర‌భాతాలు వ‌ల్లెవేస్తే స‌రికాద‌ని కూడా హిత‌వు చెబుతూ తార‌క రాముడ్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదీ ఇవాళ టీడీపీ నుంచి వినిపిస్తున్న వ్యాఖ్య‌లు. మొన్న‌టి  అసెంబ్లీ వేళ వైసీపీ అనుచిత వ్యాఖ్య‌లు చేసింద‌ని, చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రిని ఉద్దేశించి నానా మాట‌లూ అన్న‌ద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ తాము ఏమీ అన‌లేద‌ని ఇదంతా సానుభూతి పొందేందుకు చంద్ర‌బాబు న‌డిపిస్తున్న నాట‌కం అని అంటున్నారు అంబ‌డి రాంబాబు మ‌రియు కొడాలి నాని. వారి మాట‌లు ఎలా ఉన్నా కూడా తాజాగా భువ‌నేశ్వ‌రి కూడా స్పందించి త‌న‌కు జ‌రిగిన అవ‌మానం స‌భ‌లో వేరొక‌రెవ్వ‌రికీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని అంటూ ఓ లేఖ విడుద‌ల చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర మ‌రియు ఆస‌క్తిదాయ‌క ప‌రిణామం.  


ఎన్న‌డూ మాట్లాడ‌ని భువ‌నేశ్వ‌రి తొలిసారి ఈ వివాదం పై స్పందించారు. ఇదే తరుణాన వైసీపీ మ‌రింత అప్ర‌మ‌త్తం అయి చంద్ర‌బాబు ను టార్గెట్ గా చేసుకుని విరుచుకుపడుతోంది. తాము జూనియ‌ర్ చెబితే ఎందుకు త‌గ్గుతామ‌ని నానీ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయ‌న మ‌రింత మాట‌ల జోరు పెంచి కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అవి కూడా టీడీపీలో క‌ల‌వ‌రం రేపాయి. దీంతో టీడీపీ కౌంట‌ర్ ఇవ్వ‌డం కూడా ఆల్రెడీ జ‌రిగిపోయింది. ఇంత‌టి వివాదంలో ఎవ‌రు ఎవ‌రిని ఏ ఉద్దేశంతో ఏం మాట్లాడారో అన్న‌ది ఇప్ప‌టికీ సస్పెన్స్ గానే ఉంది.


ఇక జూనియ‌ర్ శిష్యుల‌యిన నానీ కానీ వంశీ కానీ మీడియా ముందుకు వ‌చ్చాక తారక్ వారితో మాట్లాడి ఉంటార‌ని కూడా కొన్ని వ‌ర్గాలు అంటున్నాయి. విదేశాల్లో ఉన్న‌ప్ప‌టికీ  ఈ వివాదంలో త‌ననెందుకు లాగుతున్నార‌ని తార‌క్ అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నాడ‌ని టాక్. ఈ క్ర‌మంలో తాను వివాదాలలో త‌ల‌దూర్చ‌న‌ని, అవ‌స‌రం అయితే టీడీపీకి సాయం చేయ‌డ‌మో లేదంటే త‌ట‌స్థంగా ఉండ‌డ‌మో త‌ప్ప ప్ర‌స్తుతానికి రాజ‌కీయం ఊసు తాను ఎత్త‌బోన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నానీకి కానీ వంశీకి కానీ ఇప్పుడు లేదా రేపు ఇలాంటి విష‌యాలే ప‌దే ప‌దే చెప్ప‌నున్నారాయ‌న. అందుకే వివాదం మ‌రింత పెరిగి పెద్ద‌ద‌యి పోయేలోగా వ‌ర్ల రామ‌య్య లాంటి టీడీపీ లీడ‌ర్ల‌పై కూడా తార‌క్ ఫోక‌స్ పెట్టి ఉంచార‌ని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో తాను, చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌డంతో ఎక్క‌డ  ఏం మాట్లాడినా మొత్తం ఆ ప్ర‌భావం సినిమాపై ప‌డుతుంద‌ని అది త‌న‌కు ఇష్టం లేద‌నే అంటున్నాడీ నంద‌మూరి చిన్నోడు. త‌న‌కు త‌న నిర్మాత‌ల క్షేమ‌మే ధ్యేయ‌మ‌ని
ఇంత‌కుమించి ముందున్న కాలంలోనూ ఏం మాట్లాడ‌బోన‌ని గ‌తంలోనూ ఇప్పుడూ ఇదే స్ప‌ష్టం చేస్తున్నాడు తార‌క్. ఇవే ఫోను చేసి చెప్పినా లేదా నేరుగా క‌లిసి చెప్పినా తార‌క్ చెప్పే మాట‌లు కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: