ఏపీ లో రాయ‌ల‌సీమ జిల్లా ల‌లో ఇప్ప‌టికే భారీ ఎత్తున వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయి. ఈ వ‌ర‌ద‌ల దెబ్బ‌తో జ‌న జీవ‌నం ఎక్క‌డిక‌క్క‌డ అస్త‌వ్య‌స్తం అయిపోయింది. ఇంత విప‌త్తు రావ‌డంతో ప్ర‌భుత్వం తీసుకుంటోన్న చ‌ర్య‌లు ఏవి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం ఇవ్వ‌లేక పోతున్నాయి. ఇక సినిమా ఇండ‌స్ట్రీ నుంచి ఎవ్వ‌రూ స్పందించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. అయితే అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ మాత్ర‌మే త‌న గీతా సంస్థ నుంచి రు. 10 ల‌క్ష‌లు ఏపీ వ‌ర‌ద‌ల‌కు ఇచ్చారు.

సినిమా వాళ్లు మౌనంగా ఉండ‌డంపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ సీనియ‌ర్ నేత‌, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా వాళ్ల తీరుపై విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలో కూడా ఆయ‌న కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న‌న్న ఇళ్ల‌లో శోభ‌నం కూడా చేసుకునే ప‌రిస్థితి లేద‌ని విమ‌ర్శించారు.

ఇక ఇప్పుడు ఇండ‌స్ట్రీ ని టార్గెట్ చేశారు. సీమ జిల్లా ల‌తో పాటు నెల్లూరు జిల్లా లు వ‌ర‌ద‌ల‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయాయ‌ని.. అయినా సినిమా హీరోలు, ప్ర‌ముఖులు ఎవ్వ‌రూ కూడా స్పందించ‌క పోవ‌డం బాధాక‌రం అని చెప్పాడు. ఈ టాప్ హీరోలు ఎవ్వ‌రూ కూడా కనీసం ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ప్ర‌జ‌ల అభిమానంతోనే తాము స్టార్ హీరోలం అయ్యామ‌న్న విష‌యాన్ని వారు గుర్తు చేసుకోవాల‌ని ప్ర‌స‌న్న కుమార్ హిత‌వు ప‌లికారు.

గతంలో ఎన్టీఆర్, అక్కినేని వరద బాధితుల కోసం, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం జోలె పట్టి రోడ్డు మీదకు వ‌చ్చి మ‌రీ విరాళాలు సేక‌రించార‌ని ప్ర‌స‌న్న కుమార్ గుర్తు చేశారు. వారు సినిమా ఇండ‌స్ట్రీకి రెండు క‌ళ్లు లా ఉన్నార‌ని.. అయితే ఇప్పుడు హీరోల్లో ఆ క‌నీస బాధ్య‌త కూడా క‌రువైంద‌ని ప్ర‌స‌న్న విమ‌ర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: