బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తన ఎంపీ లాడ్స్ నిధుల్లో సుమారు 40 లక్షల రూపాయలను చర్చిల నిర్మాణం కోసం కేటాయించారు. దీనిపై కేంద్రానికి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన కేంద్రం... గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ ఏ మాత్రం స్పందించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం... ఇప్పుడు మరోసారి వివరణ కోరింది. సాధారణంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం ఎంపీ లాడ్స్ కేటాయిస్తుంది. వీటిపై ఆడిటింగ్ కూడా జరుగుతుంది. ఈ ఆడిటింగ్లో బాపట్ల ఎంపీ సురేష్... ఓ చర్చి నిర్మాణానికి నిధులు ఖర్చు చేసినట్లు ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. కేవలం మతపరమైన నిర్మాణానికి నిధులు ఇవ్వడం పార్లమెంట్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మత మార్పిడులకు కూడా నిధులు వినియోగిస్తున్నట్లు రఘురామ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఇప్పుడు కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. మరి ఏపీ సర్కార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.
బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తన ఎంపీ లాడ్స్ నిధుల్లో సుమారు 40 లక్షల రూపాయలను చర్చిల నిర్మాణం కోసం కేటాయించారు. దీనిపై కేంద్రానికి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన కేంద్రం... గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ ఏ మాత్రం స్పందించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం... ఇప్పుడు మరోసారి వివరణ కోరింది. సాధారణంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం ఎంపీ లాడ్స్ కేటాయిస్తుంది. వీటిపై ఆడిటింగ్ కూడా జరుగుతుంది. ఈ ఆడిటింగ్లో బాపట్ల ఎంపీ సురేష్... ఓ చర్చి నిర్మాణానికి నిధులు ఖర్చు చేసినట్లు ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. కేవలం మతపరమైన నిర్మాణానికి నిధులు ఇవ్వడం పార్లమెంట్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మత మార్పిడులకు కూడా నిధులు వినియోగిస్తున్నట్లు రఘురామ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఇప్పుడు కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. మరి ఏపీ సర్కార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.