కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు కూడా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న ట్రాక్టర్ మార్చ్ను రైతులు రద్దు చేశారు. అయితే... చట్టాలు రద్దు అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. వచ్చే నెలలో మరోసారి సమావేశం అవుతామన్నారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. సమావేశాలకు సరిగ్గా రెండు రోజుల ముందు మార్చ్ రద్దు నిర్ణయాన్ని రైతులు ప్రకటించారు. అయితే రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చే చట్టం కోసం తమ పోరాటం జరుగుతుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన రైతులకు స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు కూడా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 29వ తేదీన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న ట్రాక్టర్ మార్చ్ను రైతులు రద్దు చేశారు. అయితే... చట్టాలు రద్దు అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. వచ్చే నెలలో మరోసారి సమావేశం అవుతామన్నారు. ఇందులో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. సమావేశాలకు సరిగ్గా రెండు రోజుల ముందు మార్చ్ రద్దు నిర్ణయాన్ని రైతులు ప్రకటించారు. అయితే రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చే చట్టం కోసం తమ పోరాటం జరుగుతుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన రైతులకు స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.