2019 ఎన్నికల్లో జగన్ అదే చేశారు...2014 ఎన్నికల్లో సీట్లు ఇచ్చిన అభ్యర్ధుల్లో కొందరికి 2019 ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదు. పరిస్తితులకు తగ్గట్టు వ్యూహం మార్చి అభ్యర్ధులని రంగంలోకి దింపి విజయం సాధించారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఇలాంటి సమీకరణాలతోనే జగన్ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది.
ఇదే క్రమంలో రాజధాని అమరావతి ప్రాంతం పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో మార్పులు తప్పనిసరి అని తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వచ్చే ఎన్నికల్లో సీటు డౌటే అని చెప్పొచ్చు. ఈమెపై ఎంత వ్యతిరేకత పెరిగిందో చెప్పాల్సిన పని లేదు. పైగా అమరావతి అంశం ఫుల్ నెగిటివ్. కాబట్టి ఇక్కడ వైసీపీ తరుపున స్ట్రాంగ్ అభ్యర్ధిని నిలబెట్టే ఛాన్స్ ఉంది. మంగళగిరి సీటు మార్చే అవకాశం లేదు.