తమ పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై చర్చించారు. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతం ముంపులోనే ఉందని తెలిపారు. వరద కారణంగా జరిగిన ప్రాణనష్టంపై పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు. ఇక రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకానంద హత్య కేసుపై ప్రధానంగా చర్చించారు. హత్య కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్వాన్సుగా కోటి రూపాయలు ఇచ్చారనే విషయంపై ఈడీ విచారణకు పట్టుబట్టాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఇక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్న విషయాన్ని సభలో చర్చించాలని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇక రాష్ట్రానికి రాజధానిగా అమరావతి మాత్రమే అనే విషయాన్ని సభలో తీర్మానం చేసేలా చూడాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు.
తమ పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై చర్చించారు. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతం ముంపులోనే ఉందని తెలిపారు. వరద కారణంగా జరిగిన ప్రాణనష్టంపై పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు. ఇక రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వివేకానంద హత్య కేసుపై ప్రధానంగా చర్చించారు. హత్య కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్వాన్సుగా కోటి రూపాయలు ఇచ్చారనే విషయంపై ఈడీ విచారణకు పట్టుబట్టాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఇక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్న విషయాన్ని సభలో చర్చించాలని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇక రాష్ట్రానికి రాజధానిగా అమరావతి మాత్రమే అనే విషయాన్ని సభలో తీర్మానం చేసేలా చూడాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు.