రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత వేగవంతమైన మార్పులు వస్తున్నాయని.. టిఆర్ఎస్ పాలన సాగిన ఏడున్నరేళ్లలో ఉద్యమకారులు కూడా సంతోషంగా లేరని.. తెలంగాణ కవులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, ఉద్యమకారులు ఒక్కొక్కరుగా టిఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని, కెసిఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై కత్తులు నూరుతున్నారు అని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలు సాధారణమైనవి కావని టీఆర్ఎస్ గెలుపు కోసం కెసిఆర్ స్వయంగా రెండు నెలలు పూర్తిగా కేటాయించేలా చేసిన ఎన్నికల ని చెప్పుకొచ్చారు.
అయిన వారిని ప్రజలు నమ్మలేదని తెలిపారు. ఆ ఒక్క ఎన్నిక కోసమే దళిత బంధు తెచ్చారని అయినా వారికి ఓటమే మిగిలింది అన్నారు. హుజురాబాద్ లో ఎంత మందికి దళిత బందు ఇచ్చారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ అందరికీ ఇస్తానంటే తామే వాలంటర్లుగా పని చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ సేకరణకు కేంద్రం 2014లో రూపాయలు 3,600 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది 26 వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు.