దీంతో మంత్రి పదవుల రేసులో ఉన్నవారు.. తమకు మంత్రి పదవి వస్తే బాగుండని.. భవిస్తున్నవారు.. ఇప్పుడు దేవుడి కరుణ కోసం.. దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిజానికి తమకు దేవుడు.. రాము డు.. అన్నీ.. వైసీపీ అధినేత, తమ అన్న, సీఎం జగన్ అని చెప్పుకొనే వారు కూడా.. ఇప్పుడు దేవాల యాలబాట పట్టడం.. వైసీపీలోనే చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే.. సీఎం జగన్ ఎవరికి అప్పాయిం ట్మెంట్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే.. ఎవరికి అప్పాయింట్మెంట్ ఇచ్చినా.. మరొకరికి ఇవ్వడం లేదనే గుస్సా వ్యక్తమవుతోంది. దీంతో అందరినీ ఆయన దూరం పెడుతున్నారు.
దీంతో తమ మనసులో మాటలను చెప్పుకొనేందుకు వైసీపీ నాయకులు దేవుడి చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల.. ఫైర్ బ్రాండ్ రోజా.. కృష్ణాజిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పురోహితుడు.. మీ కోరిక ఏంటి? అంటే.. పైకి చెప్పేది కాదని.. ముసిముసిగా నవ్వుకున్నారట. ఇక, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. మంగళగిరిలోని.. పానకాల స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. గుడివాడలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆకు పూజ చేయించుకున్నారు.
అదేవిధంగా.. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారధి.. ఏకంగా.. భద్రాచలం వెళ్లి.. రాముడిని శరణు జొచ్చారు. అదేసమయంలో ఎందుకైనా మంచిదని.. విజయవాడలోని ప్రముఖ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇక, గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఈ వారంలో జెరూసలేం యాత్రం పెట్టుకున్నారట. అయితే.. కరోనా నేపథ్యంలో యాత్ర కాన్సిల్ కావడంతో.. ఇంట్లోనే ఈ వారంలో ప్రత్యేక ప్రార్ధనలు పెట్టుకుంటున్నారని.. చర్చ నడుస్తోంది. కడపలో నూ వైసీపీ నాయకులు కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారట. మొత్తంగా.. వైసీపీ నేతల దేవాలయాల యాత్ర.. ఇప్పుడు పార్టీలో ఆసక్తిగా మారడం గమనార్హం.