మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ఇప్పటికే హైకోర్టుకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తెలిపారు. అలాగే శాసనసభ, శాసన మండలిలో కూడా బిల్లు రద్దు చేసినట్లుగా ప్రభుత్వం గత శుక్రవారం మెమో దాఖలు చేసింది. దీనిపై తాజాగా హైకోర్టు త్రి సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని... మాస్టర్ ప్లాన్ కూడా ఇదే చెబుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ప్రభుత్వం ఉపసంహరించుకున్న బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు లాయర్లు. అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని త్రి సభ్య ధర్మాసనాన్ని లాయర్లు కోరారు. అయితే గవర్నర్ వద్దకు పంపామని... ఆయన అనారోగ్యం కారణంగా వాటిపైన నిర్ణయం తీసుకోలేకపోయారని అడ్వకేట్ జనరల్ నివేదించారు. దీంతో గవర్నర్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే.... విచారణ కొనసాగింపు నిర్ణయం ఉంటుందని ధర్మాసనం ప్రకటించింది.
మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ఇప్పటికే హైకోర్టుకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తెలిపారు. అలాగే శాసనసభ, శాసన మండలిలో కూడా బిల్లు రద్దు చేసినట్లుగా ప్రభుత్వం గత శుక్రవారం మెమో దాఖలు చేసింది. దీనిపై తాజాగా హైకోర్టు త్రి సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని... మాస్టర్ ప్లాన్ కూడా ఇదే చెబుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ప్రభుత్వం ఉపసంహరించుకున్న బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు లాయర్లు. అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని త్రి సభ్య ధర్మాసనాన్ని లాయర్లు కోరారు. అయితే గవర్నర్ వద్దకు పంపామని... ఆయన అనారోగ్యం కారణంగా వాటిపైన నిర్ణయం తీసుకోలేకపోయారని అడ్వకేట్ జనరల్ నివేదించారు. దీంతో గవర్నర్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే.... విచారణ కొనసాగింపు నిర్ణయం ఉంటుందని ధర్మాసనం ప్రకటించింది.