దొంగిలించింది చైనా అని చెప్పుకోలేని పాక్, మరే దేశాన్ని కూడా చేయెత్తి చూపించలేదు కాబట్టి అన్నిటికి దానికి కనిపించేది ఒకే దేశం అదే భారత్. అందుకే ఈ విషయంపై కూడా భారత్ వైపు చూస్తూ నా దేశ సమాచారం ఎవరో దొంగిలించారు అంటూ వాపోతుంది. శవాల దిబ్బను కూడా కబ్జా చేసి ఇళ్లు కట్టే వ్యాపారాలు ఉండొచ్చు గాని, ఆ దిబ్బలు పాక్ లో ఉంటె, బహుశా వాటి జోలికి ఎవరు పోరు కావచ్చు. నిజమే దాదాపుగా అదే స్థితిలో ఉన్న ఆఫ్ఘన్ జోలికి లేదా పాక్ జోలికి ఎవరు పోతారు. అక్కడ కు వెళ్లి జీవించాలని ఎవరు మాత్రం అనుకుంటారు. అసలు ఏదో ఉంది కాబట్టి ఉన్నట్టే కానీ, పాక్ ను ప్రపంచం ఎప్పుడో మరిచిపోయింది.
ఇంకా నేను ఉన్నాను అని గుర్తుచేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలా ఏదో ఒక సాకుతో ప్రపంచం ముందుకు వస్తుంది. ఇంకో సందర్భం లో కూడా పాక్ గుర్తుకు వస్తుంది, అదేమంటే ఎక్కడైనా ఏదైనా బాంబు పేలితే ఖచ్చితంగా అందరు పాక్ ప్రేరేపిత తీవ్రవాదం అని ఆ దేశాన్ని తలుచుకోక మానరు. ఇది దాని పరిస్థితి, అలాంటి దేశంలో పౌరులు, వాళ్లకు గుర్తింపు కార్డులు, ఆ సమాచారం ఎవరో దొంగిలించడం, ఇదొక సమాచారం. దానిని చెప్పుకొని ఇమ్రాన్ గారు బాధపడటం. ఎన్నడూ చూడని విశేషాలు కరోనా సమయంలో చూడాల్సి వస్తుంది. అందులో ఇలాంటివి కూడా వస్తూపోతుంటాయి అనుకోవడమే.