ఆది నుండి ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు చెల్లదు అని వైసీపీ వాదిస్తూవస్తోంది. అయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు పాలకవర్గ ఎన్నిక జరిగింది. కానీ ఫలితాలు మాత్రం కోర్టు పరిధిలోకి వెళ్ళాయి. అయితే మరుసటి రోజు తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కోర్టు తీర్పు వాయిదా వేయడంతో హైకోర్టు తీర్పు పై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుంది... ఎంపి ఓటు చెల్లుతుందా లేదా, ఒకవేళ చెల్లకపోతే జరిగే పరిణామాలు ఏమిటి...?? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. తొలిసారి జరుగుతున్న కొండపల్లి మునిసిపాలిటీపై తమ పార్టీ జెండా ఎగురవేయాలని అధికార వైసీపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉందని... కాబట్టి కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆది నుండి ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు చెల్లదు అని వైసీపీ వాదిస్తూవస్తోంది. అయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు పాలకవర్గ ఎన్నిక జరిగింది. కానీ ఫలితాలు మాత్రం కోర్టు పరిధిలోకి వెళ్ళాయి. అయితే మరుసటి రోజు తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కోర్టు తీర్పు వాయిదా వేయడంతో హైకోర్టు తీర్పు పై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుంది... ఎంపి ఓటు చెల్లుతుందా లేదా, ఒకవేళ చెల్లకపోతే జరిగే పరిణామాలు ఏమిటి...?? అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. తొలిసారి జరుగుతున్న కొండపల్లి మునిసిపాలిటీపై తమ పార్టీ జెండా ఎగురవేయాలని అధికార వైసీపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉందని... కాబట్టి కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.