ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ జగన్ సర్కార్పై రఘురామ ఫిర్యాదు చేశారు. అలాగే పలు అంశాలపై కూడా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అమరావతి రైతుల పాదయాత్ర, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వరదల సమయంలో ప్రకృతి సకాలంలో స్పందించలేదంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి బీజేపీ నేతలు మద్దతు ఇవ్వాలని ఆదేశించడాన్ని స్వాగతించారు. అమిత్ షా పర్యటన తర్వాతే... జగన్ మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును వెనక్కి తీసుకున్నారని... ఇందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రఘురామ కృష్ణంరాజు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కోరినట్లు భేటీ అనంతరం రఘురామ వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ జగన్ సర్కార్పై రఘురామ ఫిర్యాదు చేశారు. అలాగే పలు అంశాలపై కూడా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అమరావతి రైతుల పాదయాత్ర, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వరదల సమయంలో ప్రకృతి సకాలంలో స్పందించలేదంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి బీజేపీ నేతలు మద్దతు ఇవ్వాలని ఆదేశించడాన్ని స్వాగతించారు. అమిత్ షా పర్యటన తర్వాతే... జగన్ మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును వెనక్కి తీసుకున్నారని... ఇందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రఘురామ కృష్ణంరాజు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కోరినట్లు భేటీ అనంతరం రఘురామ వెల్లడించారు.