ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇప్పుడు వరుణుడు పగబట్టినట్లు కనబడుతోంది. దాదాపు 15 రోజులుగా రాయలసీమ ప్రాంతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద భీభత్సం సృష్టించింది. వర్షాలు, వరదలతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. అటు ప్రభుత్వ సహాయక చర్యలపై ఇప్పటికే పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పరామర్శకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పుడు ఇదే నిరసన సెగ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలకు కూడా తగిలింది. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సజ్జలను వరద బాధితులు నిలదీశారు. ప్రభుత్వ సాయం ఏ మాత్రం అందడం లేదని సజ్జలను అడ్డుకున్నారు. రాజంపేట నియోజకవర్గం పులపుత్తూరు గ్రామస్థులు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యటనను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. వరదల్లో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇప్పుడు వరుణుడు పగబట్టినట్లు కనబడుతోంది. దాదాపు 15 రోజులుగా రాయలసీమ ప్రాంతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద భీభత్సం సృష్టించింది. వర్షాలు, వరదలతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. అటు ప్రభుత్వ సహాయక చర్యలపై ఇప్పటికే పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పరామర్శకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పుడు ఇదే నిరసన సెగ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలకు కూడా తగిలింది. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సజ్జలను వరద బాధితులు నిలదీశారు. ప్రభుత్వ సాయం ఏ మాత్రం అందడం లేదని సజ్జలను అడ్డుకున్నారు. రాజంపేట నియోజకవర్గం పులపుత్తూరు గ్రామస్థులు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యటనను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. వరదల్లో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.