ఇప్పటికే ఈ కేటుగాళ్ల మాయలో పడి ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మోసపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా మాయగాళ్లు, కేటుగాళ్ల బురిడీ మాటలకు పడిపోయిన రాజకీయ నాయకులను చూస్తూనే ఉన్నాం. తాజాగా హై దరాబాద్ కు చెందిన శిల్పా చౌదరి దంపతులు కిట్టీ పార్టీల పేరుతో పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలను ఎలా వలలో వేసుకున్నారో ? ఎలా రు. 200 కోట్లకు ఎగనామాలు పెట్టారో ? మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఓ కేటుగాడి వలలో అధికార వైసీపీ కి చెందిన మహిళా ఎమ్మెల్యే పడబోయి తృటిలో తప్పించుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ని ఓ మోసగాడు కోవిడ్ నిధుల పేరుతో టోకరా వేయబోయాడు. తాను సీఎం వో కార్యాలయ ఉద్యోగిని అని చెప్పుకున్న సదరు మోసగాడు బాలాజీ ని ఎమ్మెల్యే ను నమ్మించ బోయాడు.
కోవిడ్ నిధులు కేంద్రం నుంచి రు. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే ను నమ్మించి మోసం చేసేందుకు ప్లాన్ వేశాడు. అయితే అనుమానం వచ్చిన ఆమె వివరాలు ఆరా తీస్తే అదేం లేదని తేలింది. అయితే బాలాజీ పై గతంలోనే గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందుతుడు బాలాజీకి ఎక్సైజ్ కోర్టు యేడాది జైలు శిక్ష తో పాటు రు. 1000 జరిమానా విధించారు.