అయితే ప్రభుత్వం చేసిన ప్రకటనకు హైకోర్టు బ్రేకులు వేసింది. మూడు రాజధానుల ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమరావతి ప్రాంత రైతులు.... హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో చేసేది లేక... ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును అసెంబ్లీలోనే రద్దు చేసింది ప్రభుత్వం. కానీ కార్యాలయాలను మాత్రం విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆ ప్రక్రియకు కూడా ప్రస్తుతం హైకోర్టు బ్రేక్ కొట్టింది. మూడు రాజధానుల బిల్లుల్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో, మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ప్రస్తుతం గవర్నర్ కార్యాలయంలో ఉన్నాయి. వీటికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉన్న స్టే మరి కొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో ప్రభుత్వానికి బ్రేక్ పడినట్లుగా ఉంది.
అయితే ప్రభుత్వం చేసిన ప్రకటనకు హైకోర్టు బ్రేకులు వేసింది. మూడు రాజధానుల ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమరావతి ప్రాంత రైతులు.... హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో చేసేది లేక... ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును అసెంబ్లీలోనే రద్దు చేసింది ప్రభుత్వం. కానీ కార్యాలయాలను మాత్రం విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆ ప్రక్రియకు కూడా ప్రస్తుతం హైకోర్టు బ్రేక్ కొట్టింది. మూడు రాజధానుల బిల్లుల్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో, మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ప్రస్తుతం గవర్నర్ కార్యాలయంలో ఉన్నాయి. వీటికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉన్న స్టే మరి కొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో ప్రభుత్వానికి బ్రేక్ పడినట్లుగా ఉంది.