కరోనా సమయంలో బస్సులు నడపడం వల్ల 251 మంది ఆర్టీసీ సిబ్బంది మరణించారు అని గుర్తు చేసుకున్నారు. రెండు సంవత్సరాలుగా డీజిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయి.. లీటర్ డీజీలో గతంలో 63.8 రూపాయలు ఉండేదని.. ఇప్పుడు 87 రూపాయలు చేరిందని.. 27 రూపాయలు అధికంగా పెరిగింది అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు స్పెర్ పార్ట్స్ ధరలు కూడా భారీగా పెరిగాయని చెప్పారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 1400 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అని పేర్కొన్నారు.
దీంతో చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి గతం లో విజ్ఞప్తి చేశామని.. ఇప్పుడు కూడా మంత్రి ద్వారా కోరుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పల్లెవేలుగు, ఆర్డినరి బస్సులకు ప్రతి కిలోమీటర్కు 25 పైసలు.. రాజధాని , ఎక్స్ ప్రెస్, గరుడ సర్వీసులకు లకు ప్రతి కిలోమీటర్కు 30 పైసలు పెంచాలని తాము ప్రతిపాదనలు పెట్టామని వివరించారు. ఆర్టీసీకి రోజుకు 14 కోట్ల ఆదాయం వరకు వస్తుందని.. చార్జీలు పెరగడం వల్ల ఆర్టీసీ మళ్ళీ నార్మల్ పరిస్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.