గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ నగదు తమకు చేరకపోవడంతో... కళాశాలల యాజమాన్యం... చివరికి హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజులను తమకు ఇవ్వకుండా... తల్లులకు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోందని పిటిషన్లో ఆరోపించాయి. దీంతో హైకోర్టు కూడా కళాశాల యజమాన్యానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఫీజు నగదును నేరుగా కాలేజీలకే ఇవ్వాలని ఆదేశించింది రాష్ట్ర హైకోర్టు. అయితే నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తీర్పు రాలేదు కాబట్టి మూడో సారి కూడా నేరుగా తల్లుల ఖాతాలోనే విద్యాదీవెన జమ చేసింది. అదే సమయంలో తల్లులకు వార్నింగ్ కూడా ఇచ్చారు వైఎస్ జగన్. ఆ నగదును మూడూ వారాల్లో సంబంధిత కాలేజీల్లో చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్. అలా చేయని వారి నుంచి ఫీజులను వసూలు చేసుకునే బాధ్యతను ఆయా కళాశాలలకే అప్పగించింది కూడా. దీనికి ఇప్పుడు కాలేజీలు కూడా అభ్యంతరం చెప్పకుండా... సరే అనేశాయి.
గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ నగదు తమకు చేరకపోవడంతో... కళాశాలల యాజమాన్యం... చివరికి హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజులను తమకు ఇవ్వకుండా... తల్లులకు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోందని పిటిషన్లో ఆరోపించాయి. దీంతో హైకోర్టు కూడా కళాశాల యజమాన్యానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఫీజు నగదును నేరుగా కాలేజీలకే ఇవ్వాలని ఆదేశించింది రాష్ట్ర హైకోర్టు. అయితే నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తీర్పు రాలేదు కాబట్టి మూడో సారి కూడా నేరుగా తల్లుల ఖాతాలోనే విద్యాదీవెన జమ చేసింది. అదే సమయంలో తల్లులకు వార్నింగ్ కూడా ఇచ్చారు వైఎస్ జగన్. ఆ నగదును మూడూ వారాల్లో సంబంధిత కాలేజీల్లో చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్. అలా చేయని వారి నుంచి ఫీజులను వసూలు చేసుకునే బాధ్యతను ఆయా కళాశాలలకే అప్పగించింది కూడా. దీనికి ఇప్పుడు కాలేజీలు కూడా అభ్యంతరం చెప్పకుండా... సరే అనేశాయి.