జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారిన ప్రశాంత్ కిషోర్... ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్ట్రాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. అదే సమయంలో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలను ఓడించే లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యత కూడా పీకే చేపట్టారు. ఇప్పటికే నితిష్ కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్ మోహన్ రెడ్డిలతో సమావేశమైన పీకే.. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలపైనే పీకే ప్రధానంగా దృష్టి సారించారు. ఐ ప్యాక్ చెందిన ఓ టీమ్ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు వస్తున్నాయి. తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాన్ని పీకే టీమ్ సేకరిస్తోంది. చివరికి తమ వివరాలను పార్టీ నేతలకు తెలియకుండా ఐ ప్యాక్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందన, ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వే ద్వారా సేకరిస్తోంది పీకే టీమ్.
జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారిన ప్రశాంత్ కిషోర్... ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్ట్రాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. అదే సమయంలో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలను ఓడించే లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యత కూడా పీకే చేపట్టారు. ఇప్పటికే నితిష్ కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్ మోహన్ రెడ్డిలతో సమావేశమైన పీకే.. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలపైనే పీకే ప్రధానంగా దృష్టి సారించారు. ఐ ప్యాక్ చెందిన ఓ టీమ్ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు వస్తున్నాయి. తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాన్ని పీకే టీమ్ సేకరిస్తోంది. చివరికి తమ వివరాలను పార్టీ నేతలకు తెలియకుండా ఐ ప్యాక్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందన, ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వే ద్వారా సేకరిస్తోంది పీకే టీమ్.