రాజకీయంలో ఎప్పుడు ఏమయినా జరగవచ్చు. ఏదీ జరగకుండా కూడా ఉండిపోనూ వచ్చు. ఆ క్రమంలో కేసీఆర్ రాజకీయం కొ న్ని సార్లు, ఈటెల రాజకీయం మరికొన్ని సార్లు ఫలించి ఏదో ఒక దిశగా సంబంధిత పరిణామాలను నడపనూవచ్చు. కానీ శాశ్వత శ త్రుత్వం అయితే ఉండదు. ఒకప్పుడు ఆ ఇంట స్నేహితుడిగా మెలిగిన ఈటెల ఇప్పడు శత్రువు అయిపోయారు. తమ నాయకుడి పై తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా హుజురాబాద్ ఎన్నికల తరువాత కావడం విశేషం. హుజురాబాద్ లో ఈటెల గెలిచాక కేసీఆ ర్ తన ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పూర్తి వ్యతిరేకం అన్న విధంగా రాజకీయం నడుపుతున్నారు. అదేవిధం గా ప్రత్యక్ష పోరుకు సిద్ధం అయిపోయారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చి నానా హడావుడి చేస్తున్నారు కేసీఆర్.
ఉద్యమాలు చేసేందుకు సిద్ధం కావాలని యోచిస్తున్నారు ఈటెల.