గతేడాది మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూనే ఉన్నారు. రాత్రి 9 గంటలకు అన్ని దుకాణాలు మూసి వేయాలి. 10 గంటలకు అందరూ ఇళ్లకు చేరుకోవాలి. కానీ ఇవన్నీ ప్రస్తుతం కాగితాలకే పరిమితం అయ్యాయి. ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావటం లేదు. రాత్రి 12 గంటల తర్వాత కూడా ప్రజలు యదేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళుతున్నారు. ఇక మాస్క్ అనేది ఏ మాత్రం పెట్టుకోవడం లేదు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మాస్క్ ధరించటం లేదు. పైగా రాష్ట్రంలో ర్యాలీలు, సభలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు థియేటర్లు కూడా వంద శాతం అనుమతిస్తున్నారు. ఇక కొవిడ్ నిబంధనలు ఎక్కడ అమలు అవుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి కూడా.
గతేడాది మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూనే ఉన్నారు. రాత్రి 9 గంటలకు అన్ని దుకాణాలు మూసి వేయాలి. 10 గంటలకు అందరూ ఇళ్లకు చేరుకోవాలి. కానీ ఇవన్నీ ప్రస్తుతం కాగితాలకే పరిమితం అయ్యాయి. ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావటం లేదు. రాత్రి 12 గంటల తర్వాత కూడా ప్రజలు యదేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళుతున్నారు. ఇక మాస్క్ అనేది ఏ మాత్రం పెట్టుకోవడం లేదు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మాస్క్ ధరించటం లేదు. పైగా రాష్ట్రంలో ర్యాలీలు, సభలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు థియేటర్లు కూడా వంద శాతం అనుమతిస్తున్నారు. ఇక కొవిడ్ నిబంధనలు ఎక్కడ అమలు అవుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి కూడా.