ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది మరో 12 గంటల్లో తుపానుగా మారనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది కళింగపట్నం - పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీనితో జవాద్ తుపానుపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల పైన ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రధానికి అధికారులు సూచించారు. దీనితో ప్రధాని కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే 35 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించారు. అలాగే అత్యవసర చర్యల కోసం ఇండియన్ ఆర్మీ, నేవీ విభాగాలను కూడా సిద్ధం చేయాలని ప్రధాని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్, టెలికమ్యూనికేషన్, ఆరోగ్యం, తాగు నీరు, వైద్యం లాంటి అత్యవసర సర్వీసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు ప్రధాని మోదీ.
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది మరో 12 గంటల్లో తుపానుగా మారనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది కళింగపట్నం - పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీనితో జవాద్ తుపానుపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల పైన ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రధానికి అధికారులు సూచించారు. దీనితో ప్రధాని కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే 35 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించారు. అలాగే అత్యవసర చర్యల కోసం ఇండియన్ ఆర్మీ, నేవీ విభాగాలను కూడా సిద్ధం చేయాలని ప్రధాని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్, టెలికమ్యూనికేషన్, ఆరోగ్యం, తాగు నీరు, వైద్యం లాంటి అత్యవసర సర్వీసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు ప్రధాని మోదీ.