కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో పాటు ... మరో మంత్రి కొడాలి నాని లాంటి వాళ్లు సైతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడితే ఆ పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో నేనే మంత్రి బాలినేని కూడా చేరిపోయారు. నందమూరి కుటుంబ సభ్యులు అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రమే ప్రధానంగా బయటకు వస్తోంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరి లోనూ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు మినహా మరెవ్వరికీ ఆ స్థాయి ఛరిష్మా లేదు.
ఇక టీడీపీ నేతల అంతర్గత చర్చల్లో పార్టీలోకి జూనియర్ రావాలంటు చర్చలు జరుగుతున్నా.. ఎవ్వరూ కూడా చంద్రబాబు కు భయపడి ఆ మాట బయటకు చెప్ప లేకపోతున్నారు. అయితే జూనియర్ అభిమానులు మాత్రం కుప్పం తో పాటు కొన్ని ప్రాంతాల్లో హడావిడి చేస్తున్నారు. పైగా ఎన్టీఆర్ అభిమానుల పేరుతో టీడీపీకి ఓట్లే యవద్దంటూ నడుస్తోన్న కర పత్రాలు కూడా టీడీపీకి ఇబ్బంది గా మారాయి. ఇక ఈ గ్యాప్ ను వైసీపీ వాళ్లు క్యాష్ చేసుకుని .. చంద్రబాబు, లోకేష్ పై ఒత్తి డి పెంచి.. వారిని నందమూరి అభిమానులు.. ఎన్టీఆర్ అభిమానులకు దూరం చేసే ప్లాన్ చేస్తున్నట్టు గానే కనిపిస్తోంది.