అయితే ఇపుడు మాత్రం వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు కట్టకట్టుకుని వచ్చినట్టే కనపడు తున్నాయి. ఈ సామాజిక వర్గంలో కూడా తమ ఆధిపత్యం తగ్గిపోతోందన్న మదనం అయితే మొదలు అయ్యింది. ఇక తెలంగాణ లో ఇప్పుడు టీఆర్ ఎస్ పదేళ్లుగా అధికారంలో ఉంది. ఆ తర్వాత వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందే తప్పా అసలు తెలుగుదేశం అక్కడ అధికారంలోకి రావడం కలే అనుకోవాలి. తెలంగాణ లో కమ్మ లు కేవలం ఖమ్మం జిల్లా కు మాత్రమే పరిమితం అయిపోయారు.
ఇక ఏపీ లో కూడా జగన్ అధికారంలో ఉన్నారు. అక్కడ టీడీపీ తో పాటు కమ్మలు రాజకీయంగానే కాకుండా.. అన్ని రంగాల్లో వెనకప డి విలవిల్లాడు తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ లో తెలుగుదేశం విజయం కమ్మలకు జీవన్మరణ సమస్య గా మారింది.
ఎలాగైనా కమ్మలు అందరూ కూడా మిగిలిన సామాజిక వర్గాలతో పాటు వైసీపీ , జగన్ పై కోపంతో రగులుతోన్న సామాజిక వర్గాలను ఏకం చేసి టీడీపీ ని అధికారంలోకి తీసుకు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసమే వారు కొత్తగా సోషల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో ? చూడాలి.