కరోనా పోయింది అని కాస్త స్థిమిత పడ్డామో లేదో ఇంతలోనే ఓమిక్రాన్ వేరియంట్ అంటూ కొత్త రకం వైరస్ కలవరం మొదలయ్యింది. కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. మొదట ముసలి వారిపై పంజా విసరగా...ఆ తరువాత యువతను టార్గెట్ చేసింది. సెకండ్ వేవ్ లో యువత ఎక్కువగా ప్రభావితులై ఎందరో తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇక మూడవ వేవ్ లో ఎక్కువగా కరోనా ఎఫెక్ట్ పిల్లలపైనే ఉండనుందని అప్పట్లో పలువురు శాస్త్రజ్ఞులు చెప్పిన మాటలు నేడు తల్లి తండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఇదే కరోనా థర్డ్ వేవ్ అయి ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తల్లులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.

ఎలా తమ పిల్లల్ని ఈ మహమ్మారి నుండి రక్షించుకోవడం అని కంగారు పడుతున్నారు. అందులోనూ ఓమిక్రాన్ మిగిలిన వెరియంట్ల కన్నా చాలా ప్రమాదమని, అలాగే వేగంగా వ్యాప్తి చెందుతుంది అని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో మరింత భయపడుతున్నారు. అయితే పలువురు వైద్యులు ఈ విషయం గురించి ఏం చెబుతున్నారు అంటే, ఇది చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము, అలాగని అశ్రద్ద పనికిరాదు. కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మీ చిన్నారులకు మాస్క్ లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం వంటి వైరస్ నిబంధనల పట్ల అవగాహన ఎక్కువ పెంచండి.

అలాగే పెద్దల కన్నా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, పౌష్ఠిక ఆహారం అందిస్తూ జాగ్రత్తలు పాటించడం మన తక్షణ కర్తవ్యం అని చెబుతున్నారు. ఇక ఈ ఓమిక్రాన్ గురించి క్లారిటీ వచ్చేందుకు ఇంకొద్ది రోజులు అధ్యయంనం  అవసరమని అప్పుడే దీని ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుంది. నివారణ చర్యలు వంటి వాటిపై స్పష్టత ఇవ్వగలమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: