అయితే ఏ మోడల్ ఎంత పెంచుతామనే విషయంపై ఈ సంస్థలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పెంచడం అనేది మోడల్ను బట్టి ఉంటుందని మారుతీ సుజుకీ చెప్పింది. వాస్తవానికి ఈ పెంపు గురించి కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే.. వివిధ ముడి వస్తువుల ధరలు కరోనా తర్వాత బాగా పెరిగాయి. వాహనాల తయారీ వ్యయాలు కూడా బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ అదనపు ఖర్చులను కంపెనీలు భరించే పరిస్థితి లేదు. ఈ అదనపు వ్యయంలో కొంత వినియోగదారుడిపై మోపక తప్పదన్న నిర్ణయానికి కార్ల కంపెనీలు వచ్చాయి.
అంతే కాదు.. ఈ రేట్ల పెంపు కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. మారుతి సుజికీ విషయానికి వస్తే.. ఈ సంస్త హ్యాచ్ బ్యాక్ ఆల్టో నుంచి ఎస్యూవీ ఎస్ క్రాస్ వరకూ అనేక మోడల్స్ను అమ్ముతోంది. ఈ సంస్థ కార్ల ధరలు 3 లక్షల నుంచి 12 లక్షల వరకూ ఉంటాయి. అయితే.. ఈ మారుతీ సంస్థ ఈ ఏడాదిలో మూడు సార్లు ధరలు పెంచింది. ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతున్నప్పడు కార్ల ధరలు పెంచడం మినహా తమకు మరో మార్గం లేదంటోంది మారుతి సుజికీ సంస్థ.
మారుతి పరిస్థితి ఇలా ఉంటే.. లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ –బెంజ్ కూడా జనవరి 1 నుంచి తమ కార్ల ధరలు 2 శాతం పెంచుతున్నామని ప్రకటించింది. అయితే అన్ని మోడల్స్ రేట్లు పెంచబోమని.. కొన్ని ఎంపిక చేసిన మోడల్స్కు మాత్రమే పెంచుతామని చెప్పింది. ఇక ఆడి సంస్థ 3 శాతం వరకూ రేట్లు పెంచుతామని ప్రకటించింది.