జగన్ ప్రభుత్వంలో బాగా నాలెడ్జ్ పరంగా గానీ...ఎడ్యుకేషన్ పరంగా గానీ ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్ రెడ్డిలు ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఇద్దరు మంత్రులు ఎక్కువ చదువుకున్నవారే. ఈ మంత్రులు ఇద్దరు సమయానికి తగ్గట్టుగానే రాజకీయం చేస్తారు. అలాగే కొందరు మంత్రులు మాదిరిగా ఎడాపెడా ప్రతిపక్షాలపై నోరు పారేయడం చేయరు. పరిస్తితులకు తగ్గట్టుగానే నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే చేస్తారు.

పైగా మంత్రులుగా కాస్త మంచి పనితీరే కనబరుస్తున్నారు. గౌతమ్ రెడ్డి లాంటి వారైతే ప్రభుత్వ సలహాదారులని పెద్దగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. సలహాదారుల సలహాలు తీసుకుంటూనే...ఆయనకంటూ సొంత పాలసీతో ముందుకెళ్తారు. అందుకే సురేష్ సైతం కాస్త ప్రొఫెషనల్‌ గానే ఉంటారు. అందుకే ఈ ఇద్దరు మంత్రులకు కాస్త మంచి మార్కులే పడుతున్నాయి. పైగా మంత్రులుగానే కాకుండా...వారి సొంత నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయినా సరే...పెద్దగా వ్యతిరేకత తెచ్చుకోలేదు.

నెక్స్ట్ ఎన్నికల్లో వీరిని ఓడించడానికి టీడీపీకి అంతగా సాధ్యమయ్యే పని కాదని చెప్పాలి. సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెంలో టీడీపీ ఇంతవరకు గెలవలేదు. పైగా సురేష్‌కు యర్రగొండపాలెం కంచుకోటగా ఉంది. ఇప్పటికీ అక్కడ టీడీపీ పికప్ అవ్వలేదు. అందుకే ఈ మధ్య చంద్రబాబు ఇంచార్జ్‌ని కూడా మార్చారు. అజితా రావుని సైడ్ చేసి...ఎరిక్షన్ బాబుని ఇంచార్జ్‌గా పెట్టారు. అయినా సరే యర్రగొండపాలెం టీడీపీలో పెద్దగా మార్పులు వచ్చినట్లు కనిపించడం లేదు.


అటు గౌతమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్తితి మరీ దారుణంగా ఉంది. అసలు పార్టీ పెట్టాక ఆత్మకూరులో టీడీపీ గెలిచింది రెండుసార్లు మాత్రమే. 1983, 1994 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అక్కడ గెలిచింది. మళ్ళీ అక్కడ గెలవలేదు..2014, 2019 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి టీడీపీకి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. మొత్తానికైతే సురేష్, గౌతమ్ కోటల్లో టీడీపీకి ఛాన్స్ దొరికేలా లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: