ఇప్పటికి నిర్వాసితులకు సరైన న్యాయం చేయలేదు, ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా శాయశక్తుల వడ్డి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు నిధులు అడిగి సమయానికి పూర్తి చేయాలని 2022 ఏప్రిల్ అనే లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు. కానీ కొన్ని టెక్నికల్ సమస్యల వలన ఆ లక్ష్యం నెరవేరడం కష్టం అని కేంద్ర వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఒకపక్క కరోనా, ఇంకోపక్క లోటుబడ్జెట్, ఆర్థికభారం ఇవన్నీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టడానికి కారణంగా చెప్పవచ్చు. పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాకపోయినా, మెల్లిగా నత్తనడకన పనులు నడుస్తూ ఉండవచ్చు.
ప్రాజక్టు పనులు సరే కనీసం నిర్వాసితుల మాట ఏమిటి. వాళ్ళను ఖాళీ అయితే చేయించారు, ఇంతవరకు వారికి పరిహారం ఇవ్వడం కానీ, ఇతర సౌకర్యాలు కల్పించడం కానీ పూర్తికాలేదు. ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు వీళ్ళగతి కూడా అంతేనా అనేది కూడా ఇప్పటి ప్రశ్న. దేశంలో ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో, అందులో బలిపశువులుగా మిగిలిపోయిన నిర్వాసితులు ఎందరో.. వాళ్ళను ఒక్కసారి పరికిస్తే, బహుశా ఇంకా వాళ్లకు సరిగ్గా ఏమీ అంది ఉండకపోవచ్చు. ఇప్పటి పరిస్థితిలో ఇవన్నీ ఆలోచించడం అంత మంచిది కాదేమో, కరోనా కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఆర్థికనష్టం బాగా పెరిగిపోయింది. అందుకే అతిప్రధానమైన వాటిపై తప్ప ఖర్చులు పెట్టకపోవడం మంచిదే. మరి నిర్వాసితులు పౌరులే, వాళ్లకు కనీస అవసరాలు అందించడం కూడా అత్యవసరంలోకే వస్తుంది అనుకుంటాను, చూడండి కాస్త!