12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు.
అందులో ముఖ్యంగా మెడికల్ జెనటిక్ ల్యాబరెటరీ అందుబాటులోకి వచ్చింది.
వారసత్వంగా వచ్చే జన్యు లోపాలను సవరించే అత్యాధునిక ల్యాబ్ ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది.
మల్టీ డిసిప్లనరీ రిసెర్చ్ యూనిట్ నిమ్స్ లో అందుబాటులోకి తెచ్చాం. బోన్ డెన్సిటీవ్ మీటర్ ను అందుబాటులోకి తెచ్చాం. బోన్స్ డెన్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేదు. బోన్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తొలి సారిగా ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో తెచ్చామని  అన్నారు. న్యుమాటిక్ వ్యూ సిస్టమ్ తెచ్చాం. టెస్టింగ్ శాంపిల్స్ ను అందులో పెడితే అది ల్యాబ్ లోకి వెళుతుంది. తిరిగి ఆ ఫలితాలు రిటర్న్ తెస్తుంది.  రెండున్నర కోట్లతో ఇది తెచ్చాం. నిమ్స్ లో గతంలో బెడ్ దొరకడం కష్టంగా ఉండేది. కేసీఆర్ గారు నిమ్స్ ను బలోపేతం చేయాలని, మరో 200 పడకల ఐసీయూ బెడ్స్ ను మంజూరు చేయడం జరిగింది.  ఈ 200 బెడ్స్  జనవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి పూర్తయితే పేద ప్రజలకు నిమ్స్ లో 350 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ బెడ్స్ పూర్తయితే పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. వెంటిలెటర్ గతంలో దొరకాలంటే కష్టంగా ఉండేది. పేదవాళ్లు వెంటిలెటర్ పై ఉండాలంటే లక్షల రూపాయలు ఖర్చు  అయ్యేది.  ఈ వెంటలేటర్ 89 మాత్రమే ఉన్నాయి. 120 వెంటి లెటర్లు కొత్తవి తెస్తున్నాం. మొత్తం 209 వెంటిలెటర్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే 45 రోజుల్లో వెంటిలెటర్లు, ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తెవాలని ఆదేశించడం జరిగింది.
హెచ్ వోడీలతో మాట్లాడితే కార్పోరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం ప్రభుత్వ రంగంలో అందించాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలన్నారు. రెడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ డిపార్టమెంట్ల నుండి రిక్వేస్ట్ వచ్చాయి.  ఈ ఎక్విప్మెంట్ కావాలన్నారు. 153 కోట్లు అవసరం. రోబోటిక్ సర్జరీ ఇందులో ముఖ్యమైనది. చెతి వేళ్లు వెళ్లలేని చోట రోబోటిక్ సర్జరీ ఇది 12 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కావలని కోరడం జరిగింది. ప్రభుత్వ రంగంలో రోబోటిక్ సర్జరీ అందుబాటులో లేదు. ఇతర డిపార్ట్మెంట్లకు కావాల్సిన అత్యాధునిక మెడికల్ యంత్ర పరికరాలు కావాలన్నారు. రేడియో థెరపీలో లినాక్ ఎక్విప్మెంట్ 20 కోట్లు  ఖర్చు ఉంటుంది. అని అంకాలజీ డిపార్మెంట్ అడిగారు. ఇవన్నీ మంజూరు చేయాలన్నారు.
154 కోట్లు  ఈ కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి ఇవాళ మంజూరు చేస్తున్నాం. ఈ స్థాయి పెంచాలి. కార్పోరేట్ ఆస్పత్రులతో పోటీ పడి వైద్య సేవలు అందాలన్నది మా లక్ష్యమన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్  చేస్తున్నాం. ఇప్పుడు 5 గురు అక్కడ చికిత్స పొందుతున్నారు.  నిమ్స్ లో 8 పడకల బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ పడకలున్నాయి. ఇలా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: