అమరావతి ఉద్యమానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని విషయాల్లో కాస్త దూకుడుగా రాజకీయం చేయడమే కాకుండా అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లే విధంగా కష్టపడుతున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని విషయాలలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో అమరావతి ఉద్యమంను సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం అమరావతి ఉద్యమానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు మీద ఒత్తిడి చేస్తున్నారు అని ప్రచారం కూడా జరుగుతోంది.

చాలా వరకు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాల మీద పట్టు కోల్పోవడం అదేవిధంగా అమరావతి ఉద్యమానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ప్రజలు మద్దతు లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు తమ ఒత్తిడి చేస్తున్నారు అని ఆవేదనను కొంతమంది వద్ద వ్యక్తం చేయడం అనేది కాస్త ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని విషయాల్లో మొండి పట్టుదలగా వ్యవహరించడం అనేది ఇబ్బందికరంగా మారిన అంశంగా కూడా చెప్పాలి. రాజకీయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉన్నా సరే చంద్రబాబు వెనక్కు తగ్గక పోవడం కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

అమరావతి ఉద్యమం విషయంలో చాలా వరకు కూడా టీడీపీ నాయకత్వం ముందునుంచి ఉత్సాహంగా లేకపోవడం అనేది ఇతర పార్టీలు కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరూ అమరావతి ఉద్యమానికి విరాళాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు అని ప్రచారం అదేవిధంగా నియోజకవర్గాల ఇన్చార్జిలు తమతమ నియోజకవర్గాల్లో అమరావతి పాదయాత్ర జరుగుతున్న సమయంలో అన్ని విధాలుగా కూడా రైతులకు అండగా ఉండాలని ఇస్తున్న ఆదేశాలు ఇబ్బందికరంగా మారుతుంది. మరి భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తారని ఏంటి అనేది తెలియాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు కాస్త టీడీపీ ని వెనక్కి లాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: