ఇప్పుడు ఈ ఇబ్బందులు అన్నీ దాటుకుని... చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది రైతుల మహా పాదయాత్ర. పేరుకే తెలుగుదేశం పార్టీ అధినేత సొంత జిల్లా అయినప్పటికీ... అక్కడ టీడీపీకి అంతగా పట్టు లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేవలం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగిలిన అన్ని స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఇక మునిసిపల్ ఎన్నికల్లో అయితే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా టీడీపీ ఓడింది. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయించింది జగన్ సర్కార్. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నా పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సజావుగాసాగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని రైతులు ఇప్పటికే నిర్ణయించారు. ఈ సభకు ప్రభుత్వ అనుమతి లభిస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో ప్రస్తుతం కోస్తా వర్సెస్ సీమ అన్నట్లుగా పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు ఈ ఇబ్బందులు అన్నీ దాటుకుని... చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది రైతుల మహా పాదయాత్ర. పేరుకే తెలుగుదేశం పార్టీ అధినేత సొంత జిల్లా అయినప్పటికీ... అక్కడ టీడీపీకి అంతగా పట్టు లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేవలం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగిలిన అన్ని స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఇక మునిసిపల్ ఎన్నికల్లో అయితే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా టీడీపీ ఓడింది. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయించింది జగన్ సర్కార్. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నా పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సజావుగాసాగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని రైతులు ఇప్పటికే నిర్ణయించారు. ఈ సభకు ప్రభుత్వ అనుమతి లభిస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో ప్రస్తుతం కోస్తా వర్సెస్ సీమ అన్నట్లుగా పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది.