ఏడేళ్లుగా ఎదురులేకుండా దూసుకుపోతున్న తెరాసాకి దుబ్బాక ఉప ఎన్నికల్లో తొలి దెబ్బ తగిలింది. ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు ఊహించని షాక్ ఇచ్చాయి. వెంటనే సాగర్ ఉప ఎన్నికల్లో విజయం కొరకు ఎన్ని ఎత్తులు వేయాల్సి వచ్చిందో, మరెంత ఖర్చు చేయాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ తప్పులు చేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈటెల ఎపిసోడ్ హుజురాబాద్ ఉప ఎన్నిక రెండూ కూడా ఆయన చేతులారా చేసుకున్నవే తప్పించి ఇంకేవీ కావు. కాకపోతే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు తిరుగులేదని ధీమాగా చెప్పుకున్న గులాబీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఫలితం ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే వచ్చిపడిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ కు అగ్నిపరీక్షగా మారాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిస్థితుల పై ఎవరూ స్పందించడానికి ఇష్టపడడం లేదు. అధికార పక్షంగా తమకు ఉన్న బలం, బలగంతో స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు. దీనికి కారణం ఓటర్లలో 70 శాతం మంది టిఆర్ఎస్ కు చెందిన వారే. కాకుంటే స్థానిక సంస్థల విషయం లైట్ తీసుకోవడం వల్ల కేసీఆర్ పై అక్కడి ప్రజా ప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఈటెల ఎపిసోడ్ ఒకటి దీనికి తోడు అయింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గా గెలిచిన వారిని కెసిఆర్ పట్టించుకోవడం, స్థానిక సంస్థల్ని బలపరిచే విషయంలో భారీ స్పీచ్ లు ఇచ్చే కేసీఆర్ వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం జరుగుతుంది. దీనితో స్థానిక సంస్థల సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్న వారి తీరును తెలుసుకున్న సీఎం కేసీఆర్ జిల్లా, మండల పరిషత్ అభివృద్ధికి తక్షణమే 250 కోట్లు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను ఆదేశించినట్లుగా చెబుతున్నారు.
ఏడేళ్లుగా ఎదురులేకుండా దూసుకుపోతున్న తెరాసాకి దుబ్బాక ఉప ఎన్నికల్లో తొలి దెబ్బ తగిలింది. ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు ఊహించని షాక్ ఇచ్చాయి. వెంటనే సాగర్ ఉప ఎన్నికల్లో విజయం కొరకు ఎన్ని ఎత్తులు వేయాల్సి వచ్చిందో, మరెంత ఖర్చు చేయాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ తప్పులు చేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈటెల ఎపిసోడ్ హుజురాబాద్ ఉప ఎన్నిక రెండూ కూడా ఆయన చేతులారా చేసుకున్నవే తప్పించి ఇంకేవీ కావు. కాకపోతే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు తిరుగులేదని ధీమాగా చెప్పుకున్న గులాబీ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఫలితం ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే వచ్చిపడిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ కు అగ్నిపరీక్షగా మారాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ పరిస్థితుల పై ఎవరూ స్పందించడానికి ఇష్టపడడం లేదు. అధికార పక్షంగా తమకు ఉన్న బలం, బలగంతో స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు. దీనికి కారణం ఓటర్లలో 70 శాతం మంది టిఆర్ఎస్ కు చెందిన వారే. కాకుంటే స్థానిక సంస్థల విషయం లైట్ తీసుకోవడం వల్ల కేసీఆర్ పై అక్కడి ప్రజా ప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఈటెల ఎపిసోడ్ ఒకటి దీనికి తోడు అయింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గా గెలిచిన వారిని కెసిఆర్ పట్టించుకోవడం, స్థానిక సంస్థల్ని బలపరిచే విషయంలో భారీ స్పీచ్ లు ఇచ్చే కేసీఆర్ వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం జరుగుతుంది. దీనితో స్థానిక సంస్థల సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్న వారి తీరును తెలుసుకున్న సీఎం కేసీఆర్ జిల్లా, మండల పరిషత్ అభివృద్ధికి తక్షణమే 250 కోట్లు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను ఆదేశించినట్లుగా చెబుతున్నారు.