అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి నుంచి తెలుగుదేశం పార్టీపై ఒంటికాలితో దూకే సోము వీర్రాజు... ఫలితాల అనంతరం కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై అదే దూకుడు ప్రదర్శించారు. అయితే ఇదే సమయంలో సోము వీర్రాజు వ్యవహారం కొంత అనుమానం కూడా కలిగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే అపవాదు కూడా సోము వీర్రాజు మూట గట్టుకున్నారు. పార్టీ నేత విష్ణువర్థన్ రెడ్డితో కలిసి జగన్తో లాలూచీ పడ్డారనే ఆరోపణలు కూడా వీర్రాజుపై వెల్లువెత్తాయి. రాష్ట్రంలో బీజేపీని భారతీయ జగన్ పార్టీగా వీర్రాజు మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకోసమే... పార్టీలో వీర్రాజు ప్రాధాన్యత తగ్గిపోయిందని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం సొంత పార్టీలోనే వీర్రాజుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదనే చర్చ జరుగుతోంది. ఆయనకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా కేంద్ర పెద్దలు కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పార్టీలో పేరుకే పెద్దగా ఉన్నాననే భావన ప్రస్తుతం వీర్రాజుకు కలిగినట్లు సన్నిహితుల మాట. దీంతో రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి నుంచి తెలుగుదేశం పార్టీపై ఒంటికాలితో దూకే సోము వీర్రాజు... ఫలితాల అనంతరం కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై అదే దూకుడు ప్రదర్శించారు. అయితే ఇదే సమయంలో సోము వీర్రాజు వ్యవహారం కొంత అనుమానం కూడా కలిగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే అపవాదు కూడా సోము వీర్రాజు మూట గట్టుకున్నారు. పార్టీ నేత విష్ణువర్థన్ రెడ్డితో కలిసి జగన్తో లాలూచీ పడ్డారనే ఆరోపణలు కూడా వీర్రాజుపై వెల్లువెత్తాయి. రాష్ట్రంలో బీజేపీని భారతీయ జగన్ పార్టీగా వీర్రాజు మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకోసమే... పార్టీలో వీర్రాజు ప్రాధాన్యత తగ్గిపోయిందని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం సొంత పార్టీలోనే వీర్రాజుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదనే చర్చ జరుగుతోంది. ఆయనకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా కేంద్ర పెద్దలు కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పార్టీలో పేరుకే పెద్దగా ఉన్నాననే భావన ప్రస్తుతం వీర్రాజుకు కలిగినట్లు సన్నిహితుల మాట. దీంతో రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.