ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ అదే దెబ్బ కాంగ్రెస్ కొట్టాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన విపక్షాల ఆందోళనకు తన మద్ధతు తెలిపాడు సీఎం కేసీఆర్. కాంగ్రెస్తో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు వెళ్లి నిరసన తెలిపారు. మళ్లీ సేమ్ కార్డ్ కానీ, పేర్లు మాత్రమే వేరు అన్నట్టు బీజేపీ స్థానంలో కాంగ్రెస్ పేరు వచ్చింది. దీంతో ఢిల్లీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని వాళ్లంతా దొంగలు అంటూ రాష్ట్ర బీజేపీ ప్రచారం మొదలుపెట్టేసింది. ఇప్పటికే హుజురాబాద్ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ బొక్కా బోర్లా పడి మళ్లీ తిరిగి లేవడానికి ప్రయత్నాలు చేస్తోంది.
అదే సమయంలో బీజేపీ పై ఎదురుదాడి చేస్తూ.. కేసీఆర్పై పోరాటానికి రేవంత్ ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకటే అనే భావన తెలంగాణ ప్రజల్లో వచ్చిందంటే ఇన్నాళ్ల తమ పోరాటం, శ్రమ వృథా అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఒక సారి కేసీఆర్ను నమ్మి మోసపోయాం మళ్లీ నమ్మొద్దని ఢిల్లీ హైకామాండ్కు చెబుతున్నారు. అంతేకాదు, ఢిల్లీలో బీజేపీ వ్యతిరేకంగా టీఆర్ఎస్ మద్ధతు తీసుకుంటే అది అక్కడి వరకే పరిమితం చేయాలని కోరుతున్నారట. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఎలా ఎదుర్కొవాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారని తెలుస్తోంది.