ఇది చాలా దారుణం అని విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని ... ఎవరు కూడా డబ్బులు కట్టవద్దని చెబుతోంది. తెలుగుదేశం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడంతో అధికార వైసిపి కాస్త డిఫెన్స్ లో పడింది. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ పథకం పై సమీక్ష చేశారు. అనంతరం ఆయన ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
ఓ టి ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ... అది పూర్తిగా స్వచ్ఛందం అని చెప్పారు. క్లియర్గా దీనితో రిజిస్ట్రేషన్ జరుగుతుందని ... రుణాలు మాఫీ చేయడంతోపాటు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కూడా జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఓ టి ఎస్ పథకం అమలు కాకుండా చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. గతంలో అసలు వడ్డీ కడితే బి ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు అని... ఇప్పుడు ఓ టి ఎస్ పథకంతో సంపూర్ణ హక్కులు కూడా ఇస్తున్నామని గుర్తు చేశారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని ... ఆ అవకాశాలను వాడు కోవాలా వద్దా ? అన్నది వారి ఇష్టానికి వదిలేస్తున్నామని జగన్ చెప్పారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయంలో కూడా రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.