నిజమైన విమర్శలు చేస్తే ఏ ప్రభుత్వం స్వాగతించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుండి అలాంటివి ఏమైనా చేశారా అంటే ఒక్కటి ఉండదు. అన్నీ లేనిపోని ప్రచారాలు చేయడం ద్వారా సృష్టించిన విమర్శలే ఉన్నాయి. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే సొంత నియోజక వర్గం నుండి కూడా తరిమేశారు. దానిని బట్టి అయినా ఆయన అర్ధం చేసుకొని ఉండాలి, అలాంటివి ఆయనకు అలవాటు లేదు కాబట్టి ఇలా ఉన్నాడు. ఆ బాధ్యత ఆయన పచ్చ మీడియా తీసుకోని, లేనిపోని తిప్పలు పడుతూ, ప్రభుత్వం పై వీలైనంత విషప్రచారం చేస్తుంది. ఎవరు ఎన్ని అన్నప్పటికీ ప్రభుత్వం చేయాలి అనుకున్నది చేసి తీరుతుంది.
ఆయా బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏమేమి ఇవ్వాలని ఆయా పధకాలు ప్రవేశపెట్టిందో అవన్నీ వారందరికీ అందించడం జరుగుతుంది. ఎవరు ఎన్ని అడ్డు పుల్లలు వేసినప్పటికీ అవన్నీ సక్రమంగా లబ్దిదారులకు ఆడిస్తాం, ఆ నమ్మకం సీఎం జగన్ గారికి ఉంది, మాకు ఉంది. పేదల నోటికాడి కూడు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు కూడా స్పష్టంగా తెలుసుకుంటున్నారు, మాకు అది చాలు. వాళ్ళే తగిన తీర్పు ఇవ్వడం ద్వారా ఎవరికి చెప్పాల్సిన బుద్ధి వాళ్లకు చెపుతారు. ప్రభుత్వం మాత్రం పధకాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.