అయితే రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా కూడా... పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఇప్పటికీ కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు. గతంలో ప్రాజెక్టు పూర్తి ఖర్చు భరిస్తామని చెప్పిన కేంద్ర జల శక్తి శాఖ... ఆ తర్వాత మాట మార్చింది. కేవలం ఇరిగేషన్ పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తామని చెప్పేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి.. ఇప్పటికీ అలాగే ఉంది. ప్రాజెక్టు కోసం ఇప్పటికే 2017-18 మధ్యకాలంలో రెండవ సారి సవరించిన అంచనా వ్యయం మొత్తం 55 వేల 548 కోట్ల రూపాయలని రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో గుర్తు చేశారు. అయితే కేంద్రం మాత్రం.. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో ఇరిగేషన్ విభాగానికి కేవలం 35 వేల 950 కోట్ల రూపాయలుగా కుదించినట్లు తెలిపింది. పైగా ఇప్పటి వరకు ఖర్చు చేసిన వివరాలు ఇవ్వాలని కూడా కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అసలు ఇచ్చిన మాట ఏమిటీ... ఇప్పుడు చేస్తునది ఏమిటీ అని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా కూడా... పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఇప్పటికీ కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు. గతంలో ప్రాజెక్టు పూర్తి ఖర్చు భరిస్తామని చెప్పిన కేంద్ర జల శక్తి శాఖ... ఆ తర్వాత మాట మార్చింది. కేవలం ఇరిగేషన్ పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తామని చెప్పేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి.. ఇప్పటికీ అలాగే ఉంది. ప్రాజెక్టు కోసం ఇప్పటికే 2017-18 మధ్యకాలంలో రెండవ సారి సవరించిన అంచనా వ్యయం మొత్తం 55 వేల 548 కోట్ల రూపాయలని రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో గుర్తు చేశారు. అయితే కేంద్రం మాత్రం.. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో ఇరిగేషన్ విభాగానికి కేవలం 35 వేల 950 కోట్ల రూపాయలుగా కుదించినట్లు తెలిపింది. పైగా ఇప్పటి వరకు ఖర్చు చేసిన వివరాలు ఇవ్వాలని కూడా కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అసలు ఇచ్చిన మాట ఏమిటీ... ఇప్పుడు చేస్తునది ఏమిటీ అని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.