ఇప్పుడు తాజాగా కౌంటర్ సభ నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. రాయలసీమ హక్కుల వేదిక భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 13వ తేదీన రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ హక్కుల కోసం విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనిని రాయలసీమ ధర్మ పోరాట దీక్ష అనే పేరు కూడా పెట్టేశారు. ఈ సభకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చేశారు. ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపు ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సభలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. కర్నూలో హైకోర్టు, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హంద్రీ - నీవా, గాలేరు - నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్ధాపురం ఎత్తిపోతల పథకాలు కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్లో సభకు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా కౌంటర్ సభ నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. రాయలసీమ హక్కుల వేదిక భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 13వ తేదీన రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ హక్కుల కోసం విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనిని రాయలసీమ ధర్మ పోరాట దీక్ష అనే పేరు కూడా పెట్టేశారు. ఈ సభకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చేశారు. ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపు ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సభలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. కర్నూలో హైకోర్టు, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హంద్రీ - నీవా, గాలేరు - నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్ధాపురం ఎత్తిపోతల పథకాలు కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్లో సభకు ఏర్పాటు చేస్తున్నారు.