ఇక పార్లమెంట్ సమావేశాల సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తోందని ఆర్ఆర్ఆర్ సభలో ప్రస్తావిస్తున్న సమయంలో... వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ మిథున్ రెడ్డి కల్పించుకుని తప్పుబట్టారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి వెనుక కూర్చున్న నందిగాం సురేష్... తనను బూతులు తిట్టాడంటూ స్పీకర్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖలు రాశారు ఆర్ఆర్ఆర్. అనరాని మాటలు అన్నాడని... తనను చంపుతానంటూ బెదిరించినట్లు కూడా ఆరోపించారు. ఓ వైపు ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని కులం పేరుతో దుషించాడని... తప్పుడు కేసు పెట్టించి వేధించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎస్సీ మాల వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించి... పోలీసులతో కొట్టించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు నందిగాం సురేష్.
ఇక పార్లమెంట్ సమావేశాల సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తోందని ఆర్ఆర్ఆర్ సభలో ప్రస్తావిస్తున్న సమయంలో... వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ మిథున్ రెడ్డి కల్పించుకుని తప్పుబట్టారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి వెనుక కూర్చున్న నందిగాం సురేష్... తనను బూతులు తిట్టాడంటూ స్పీకర్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖలు రాశారు ఆర్ఆర్ఆర్. అనరాని మాటలు అన్నాడని... తనను చంపుతానంటూ బెదిరించినట్లు కూడా ఆరోపించారు. ఓ వైపు ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని కులం పేరుతో దుషించాడని... తప్పుడు కేసు పెట్టించి వేధించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎస్సీ మాల వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో దూషించి... పోలీసులతో కొట్టించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు నందిగాం సురేష్.