విదేశాల్లో కూర్చుని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ, వ్యక్తులపై విమర్శలు చేస్తుంటే ఎలా సహిస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. మన వ్యవస్థల సత్తా ఏమిటో చూపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. సీబీఐ తీసుకుంటున్న చర్యలేమిటి, విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో వివరిస్తూ జనవరి 25లోపు పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ధర్మాసనం అదేశించింది. ఈ అఫిడవిట్ను పరిశీలించిన తరువాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి... కేసు దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పూర్తి స్థాయి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక దశలో సీబీఐ దర్యాప్తు తీరుపై అశ్వనీ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. సీబీఐకి మరో నెల రోజులు సమయం ఇద్దామని, అఫిడవిట్ను పరిశీలించిన తరువాత ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిద్దామని ధర్మాసనం సూచించింది.
విదేశాల్లో కూర్చుని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ, వ్యక్తులపై విమర్శలు చేస్తుంటే ఎలా సహిస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. మన వ్యవస్థల సత్తా ఏమిటో చూపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. సీబీఐ తీసుకుంటున్న చర్యలేమిటి, విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో వివరిస్తూ జనవరి 25లోపు పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ధర్మాసనం అదేశించింది. ఈ అఫిడవిట్ను పరిశీలించిన తరువాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి... కేసు దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పూర్తి స్థాయి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక దశలో సీబీఐ దర్యాప్తు తీరుపై అశ్వనీ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. సీబీఐకి మరో నెల రోజులు సమయం ఇద్దామని, అఫిడవిట్ను పరిశీలించిన తరువాత ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిద్దామని ధర్మాసనం సూచించింది.